నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

డీవీ

బుధవారం, 26 జూన్ 2024 (13:40 IST)
Nikhil
నిఖిల్ నటించిన పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'స్వయంభూ', మారేడుమిల్లిలోని సుందరమైన ప్రదేశాలలో దాని కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. మారేడుమిల్లిలోని దట్టమైన అడవులలో నిఖిల్ నటించిన అనేక ప్రముఖ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నందున ఈ షెడ్యూల్ చాలా ముఖ్యమైనది. ఈ సన్నివేశాలు కథనానికి కీలకంగా చిత్ర యూనిట్ పేర్కొంది. భారీ స్థాయిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది.
 
ప్రతిభావంతులైన భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన 'స్వయంభూ' అనేది నిఖిల్ 20వ సినిమా ఇది. ఈ సినిమా నిఖిల్ కు  మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు నిఖిల్, సంయుక్త, నభా నటేష్ నటీనటులుకాగా, క్రిష్ భరత్, రవి బస్రూర్, సెంథిల్ కుమార్, ఠాగూర్ మధు సాంకేతిక వర్గం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు